గీసుకొండ మండలంలో పాత గొడవల నేపథ్యంలో భూక్యా రాజ్నకుమార్ అనే వ్యక్తిపై హలవత్ రాజు, హలవత్ భద్రు అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. రాజ్నకుమార్ ఆటోలో వెళ్తుండగా, నిందితులు అడ్డుకొని విచక్షణారహితంగా కొట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.