అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతుందని ఫిర్యాదు

హన్మకొండ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన కొమురమ్మ, సమ్మయ్య అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తి పంచిపెట్టిన తరువాత తమకు అన్నం పెట్టడం లేదని, అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతుందని మంగళవారం కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసారు. తమను పట్టించుకోని వారికి ఆస్తి ఎందుకు ఇవ్వాలని, తమ ఆస్తి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్