పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్రమ సిట్ నోటీసులు అందించడాన్ని ఖండిస్తూ, రేవంత్ రెడ్డి సర్కార్కు భారత రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.