హనుమకొండ భవాని నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, మహిళా డైరీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డైరీ ఆవశ్యకత, నిర్మాణం, యజమాని బాధ్యతలు, పాల ఉత్పత్తి, పాల మార్కెటింగ్ పై అవగాహన కల్పించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.