వరంగల్ జిల్లా పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బి. శంకర్ (50) సోమవారం కొత్తగూడెంలో విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. పరకాల నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు కొత్తగూడెం క్రాస్ దాటాక కండక్టర్కు ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.