స్టేషన్ ఘనపూర్ లో శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకే జై భీమ్, జై బాపు, జై సమ్మిదాన్ కార్యక్రమం అని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యంగ విలువల పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.