వరంగల్లోని ఏకేతండాలో ఓ యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్రేప్ చేశారని, తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, యువతి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మృతదేహాన్ని వర్ధన్నపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు.