పర్వతగిరి మండలం సీత్య తండాకు చెందిన కానిస్టేబుల్ రమావత్ అనిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హనుమకొండ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.