మేడారం మహాజాతరలో ఐదుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ కు చెందిన పల్లపు రాజు వాంతులతో ఇబ్బంది పడి మృతి చెందగా, జంపన్న వాగులో పడి మరో భక్తుడు మృతి చెందాడు. హనుమకొండ జిల్లాకు చెందిన శంకర్ అస్వస్థతకు గురై మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా ఐందారం గ్రామానికి చెందిన రేవల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. జంపన్నవాగు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కూడా లభ్యమైంది.