మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. నోటీసులు పంపితేనే ఇంత గందరగోళమా అని ప్రశ్నించిన ఆయన, తప్పు చేయనివారు ఇలాంటి నిరసనలు ఎందుకు చేస్తారని అన్నారు. సొంత కూతురే చెప్పినట్లు, తప్పు చేయకపోతే సిట్ ముందు వెళ్లి నిరూపించుకోవాలని సూచించారు.