హన్మకొండ భీమారం లోని ఎస్ వీ ఎస్ కళాశాల సమీపంలో ఉన్న శశాంక బాయ్స్ హాస్టల్ లో భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినా, వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆహార తనిఖీ అధికారి హాస్టల్ కు వచ్చి భోజనాన్ని పరిశీలించి, నిర్వాహకులకు 15,000 రూపాయల జరిమానా విధించారు.