హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన NCC క్యాడెట్లు నవదీప్, కావ్యలు జాతీయ స్థాయి “నేషనల్ అడ్వెంచర్ క్యాంప్”కు ఎంపికయ్యారు. ఈ నెల 7 నుండి 16 వరకు ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశి జిల్లాలో నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో జరిగే శిక్షణలో వీరు పాల్గొంటారు. NCC విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, దేశభక్తిని పెంపొందిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు.