వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో ఆదివారం తెల్లవారుజామున కొండచిలువ కనిపించడంతో విద్యార్థులు, రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రివేళ విధులకు వెళ్లే వైద్య విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వచ్చే రోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కొండచిలువ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. గతంలో కూడా కేఎంసీలో కొండచిలువలు కనిపించినట్లు సమాచారం.