నేటి ప్రజావాణి రద్దు: కమిషనర్ చాహాత్ బాజ్ పాయి

గ్రేటర్ వరంగల్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో శానిటేషన్, పునరుద్దరణ పనులు, వాటిల్లిన నష్టాన్ని నమోదు చేయడంలో బల్దియా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం వరంగల్ బల్దియాలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ చాహాత్ బాజ్ పాయి ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్