కాజీపేట చౌరస్తాలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓబన్న అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని, కష్టజీవుల హక్కులు, సమానత్వం, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.