ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగర మేయర్ గుండు సుధారాణితో కలసి 11 వ డివిజన్ రంగంపేటలో ఫాతిమున్నిసా 29 వ డివిజన్ రామన్నపేటలో టూంగుటూరి శ్రీదేవికి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.