పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో యాసారపు యాకయ్య అనే కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. అధిక ఎండల కారణంగా సాయంత్రం అస్వస్థతకు గురైన యాకయ్య, బుధవారం తెల్లవారుజామున వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. యాకయ్య భార్య గతంలోనే మరణించినట్లు తెలిసింది.