వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. కమిటీ ఛైర్పర్సన్గా ప్రియాంక, వైస్ చైర్మన్గా జనార్దన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు డైరెక్టర్లుగా దుగ్యాల గోపాల్ రావు, గజ్జల శ్యామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, మార్కెట్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పాలకవర్గం పేర్కొంది.