పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా పరిధిలోని భవానిపూర్లో 80 ఏళ్ల బల్విందర్ కౌర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే భద్రతా సిబ్బంది ఆమెకు సహాయం అందించి ఓటు వేసేందుకు సహకరించారు. పశ్చిమ బెంగాల్ లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రెండోదశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగానూ 142 సీట్లలో రెండో దశ పోలింగ్ నేడు జరుగుతోంది.