నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం గాలిస్తున్నాం: CP తరుణ్ జోషి

TG: రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని చంపిన కేసులో నిందితుడు రాజ్​ కుమార్ పరారీలో ఉన్నాడని సీపీ తరుణ్​ జోషి పేర్కొన్నారు. నిందితుడి కోసం 7 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. రాజ్​ కుమార్ అర్ధరాత్రి షాబాద్‌ వెళ్లి బాలిక తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపాడని, బాలికను షాబాద్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లి దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద చంపేసినట్లు గుర్తించామన్నారు. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్‌ తెచ్చుకుని విడుదలైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్