ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేవీపీ రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని, అలాంటి ఆరోపణలు చేసిన పోలీసు అధికారికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఆరోపణలు నిరూపిస్తే, వైఎస్ఆర్ అభిమానులందరూ కలిసి సీఎం సహాయ నిధికి రూ.10 కోట్లు విరాళంగా ఇస్తామని కేవీపీ సవాల్ విసిరారు.