కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగికదాడి కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవణ్ణ భారత్కు తిరిగి రాగానే విమానాశ్రయంలో అరెస్టు చేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మే 31న సిట్ ఎదుట హాజరుకానున్నట్టు వీడియో విడుదలైన నేపథ్యంలో విమానాశ్రయంలో దిగగానే రేవణ్ణను అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.