TG: మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 'రాష్ట్రంలో చెంచులందరికీ మొదటి విడతలోనే ఇళ్లు ఇచ్చాం. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కూడా నిధులు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చింది. మేము అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తున్నాము' అని అన్నారు.