TG: సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్గొండ సభలో మాట్లాడుతూ.. 'తులసివనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో మిగిలిన ఒక్కరిని కూడా గెలవనియ్యం' అని అన్నారు. యువత వెంకన్నను నమ్ముకుని ఉన్నారని, వారు మళ్ళీ సూర్యాపేటలో తమ పట్టు నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారని తెలిపారు.