అహ్మదాబాద్లోని వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు దూకుడు చూపుతూ విండీస్ను 162 రన్స్లో ఆలౌట్ చేశారు. సిరాజ్ 4/40తో కీలక వికెట్లు తీశాడు. బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, సుందర్ 1 వికెట్ సాధించారు. జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులతో విండీస్ తరఫులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో భారత బౌలింగ్ శక్తి మరింత చాటింది.