భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. 'వందేమాతరం, భారత్ మాతా కీ జై అనడంలో తనకు ఎలాంటి సమస్య లేదని అన్నారు. తాను భారత్ మాతా కీ జై అంటానని అది తన దేశం పేరు అని ఆయన తెలిపారు. 'జై హింద్' అనడంలోనూ ఇబ్బంది ఉండకూడదని, దేశ చట్టం ఏదైనా చెబితే దాన్ని పాటించాల్సిందేనని పేర్కొన్నారు. నిబంధనలను అమలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని షమీ చెప్పుకొచ్చారు.