మహారాష్ట్రలోని నందూర్బార్లో జరుగుతున్న చేతఖ్ పశువుల సంతలో రెండు గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంజాబ్కు చెందిన జగ్తార్ సింగ్ తన వైట్ కోబ్రా అనే తెల్ల గుర్రాన్ని రూ.1.71 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. నుక్రా జాతికి చెందిన ఈ గుర్రం 61 అంగుళాల ఎత్తు ఉంది. రాజేంద్ర యాదవ్ తన గోధుమ రంగు రుద్రాణి అనే గుర్రాన్ని రూ.1.17 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. మార్వారి జాతికి చెందిన ఈ గుర్రం 65 అంగుళాల ఎత్తు ఉంది. వైట్ కోబ్రా కోసం నెలకు రూ.75వేలు, రుద్రాణికి ప్రతి రోజు ఎనిమిది లీటర్ల ఆవు పాలు ఖర్చు చేస్తున్నట్లు యజమానులు తెలిపారు.