AP: వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ ఎక్కడ? అని శ్యామల ప్రశ్నించారు. ఆయన సొంత శాఖ అధికారులు ఆధ్యాత్మిక స్థలాలను కూలుస్తున్నా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదని.. ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు.