ఇటీవలి కాలంలో స్పై కెమెరాల సమస్య తీవ్రంగా పెరుగుతోంది. ఎందుకంటే ఇవి హోటల్ గదులు, ట్రయల్ రూమ్లు, వాష్రూమ్లలో దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా వీడియోలు తీస్తున్నారు. ఇలా రహస్యంగా తీసిన వీడియోలను బ్లాక్మెయిల్కు లేదా ఆన్లైన్లో విక్రయించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు హాస్టల్, శంషాబాద్ హోటల్లో జరిగిన ఘటనలు దీనికి ఉదాహరణలు. ఇది గోప్యతకు పెద్ద ముప్పుగా మారింది.