AP: తూర్పు గోదావరి జిల్లా, సర్పవరంలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడు గోపిసాయితో కలిసి దుర్గాప్రసాద్ భార్యే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శుక్రవారం భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.