మధ్యప్రదేశ్లోని ధార్లో దేవకృష్ణ పురోహిత్ అనే వ్యక్తిని అతని భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు కమలేష్ కలిసి దారుణంగా హత్య చేశారు. దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా... ప్రియాంక పై అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే భర్తను చంపి అతని ఆస్తిని కైవసం చేసుకుని ప్రియుడితో కలిసి జీవించాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.