బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులకు సంబంధించి నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ మాట్లాడుతూ.. తన తల్లికి మరణశిక్ష విధించే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఢాకాలో భద్రత కట్టుదిట్టం చేస్తూ పోలీసులు హైఅలర్ట్ జారీ చేశారు. పరిస్థితులు విషమిస్తే షూట్ ఎట్ సైట్ ఆదేశాలను కూడా అధికారులు అమలు చేయనున్నారు.