బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బిహార్ కొత్త సీఎం ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. బీజేపీకి చెందిన వ్యక్తికే సీఎం అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సీఎంగా కొసాగలేరని సమాచారం. దీంతో బీజేపీ తమ అభ్యర్థిని సీఎం చేయడానికి ప్రణాళికలు వేస్తోంది. సీఎంగా నితీశ్ను కొనసాగించినా, మధ్యలో బదిలీ చేసే అవకాశముందని విశ్లేషకులు అంచనా.