TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే గతంలోనే పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా? వేటు వేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.