ప్రముఖ టెక్ సంస్థ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.49.6 కోట్ల వేతన రెమ్యునరేషన్ను అందుకున్నారు. విప్రోలో అత్యధిక వేతనం పొందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీనివాస్ పల్లియా నిలిచారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీతో పోలిస్తే సీఈఓ ఆదాయం దాదాపు 7 రెట్లు ఎక్కువ. రిషద్ ప్రేమ్జీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.7.3 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నారు.