ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లో పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి, లక్షా 77వేల రూపాయలు అపహరించిన యువతి, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహ ఏర్పాట్లు, బేబీ షవర్ ఖర్చుల పేరుతో డబ్బు తీసుకుని యువతి పరారైంది. బాధితుడి ఫిర్యాదుతో పట్వాయి పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టి, కొద్ది నెలల తర్వాత నిందితురాలు శివన్య, ఆమె స్నేహితుడు నితిన్ లను అదుపులోకి తీసుకున్నారు.