ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. చాణక్యపురికి చెందిన ప్రియాంక తనకు కాబోయే భర్తతో కలిసి ఢిల్లీలోని ఫన్ఎన్ఫుడ్ వాటర్ పార్క్కు వెళ్లింది. రోలర్ కాస్టర్ పైకి వెళ్లగానే ప్రియాంక కూర్చొన్న చోట పట్టుకునే రాడ్ విరిగిపోయింది. దీంతో ఆమె కిందపడింది. తీవ్రంగా గాయపడగా వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.