యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్.. మహిళ మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో అనారోగ్యంతో బాధపడుతున్న మునిశ్రా రావత్‌ను ఆమె భర్త శ్రీ దామోదర్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. క్లినిక్ ఆపరేటర్ జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, మహిళ కడుపులో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని సలహా ఇచ్చాడు. రూ. 20,000 డిపాజిట్ తీసుకున్న మిశ్రా, మద్యం మత్తులో యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేశాడు. మిశ్రా మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రా కూడా సహాయం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో డిసెంబర్ 6 సాయంత్రం మహిళ మృతి చెందింది. దీంతో పోలీసులు క్లినిక్‌ను సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్