AP: కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ మండలం పోలకల్ బీసీ కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన ట్రాక్టర్ నేరుగా ఇంట్లోకి దూసుకెళ్లడంతో, ఇంట్లో ఉన్న కౌకుట్ల (48) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.