బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ గుండా వెళుతున్న పోర్బందర్-ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో గర్భవతి అయిన ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. కుమార్బాగ్ స్టేషన్కు చేరుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. రైలు సిబ్బంది, TTE బృందం, రైలులో ప్రయాణిస్తున్న ANM సహాయంతో మహిళ సుఖప్రసవం అయ్యింది. శిశువు జన్మించడంతో ప్రయాణికులంతా ఆనందోత్సాహాలతో హర్షధ్వానాలు చేశారు. ప్రస్తుతం మహిళ, శిశువు సురక్షితంగానే ఉన్నారు.