ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద మొదటి విడతగా రూ.40,000 ఖాతాలోకి పడగానే.. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను తీసుకుని డబ్బుతో సహా తన ప్రియుడితో పారిపోయింది. యూపీలోని అమేఠీ జిల్లా రెభా గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర కుమారి అనే మహిళ భర్త రామ్ సంజీవ్ 2023లో అనారోగ్యంతో మరణించారు. వితంతువుగా ఉన్న ఆమె PMAY పథకం డబ్బులు అందుకోగానే ప్రియుడితో కలిసి గ్రామం పారిపోయింది.