TG: బీఆర్ఎస్ హయాంలో మహిళల సంక్షేమం గురించి ఆలోచించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల కోసం ఎన్నో పథకాల తెచ్చామన్నారు. తాజాగా 8 వేల మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన కూడా చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారాలు అసహనం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.