రాజస్థాన్లోని కిషన్గఢ్ 'టాక్సిక్ టూరిస్ట్ స్పాట్'గా మారింది. టన్నుల కొద్దీ మార్బుల్ వ్యర్థాలు పేరుకుపోయి మంచు పరుచుకున్నట్లు కనిపించడంతో దీనిని 'రాజస్థాన్ స్విట్జర్లాండ్' అని పిలుస్తున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్స్, రీల్స్ కోసం పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. అయితే, అక్కడి దుమ్ము వల్ల శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.