మహిళల ప్రీమియర్ లీగ్లో దిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్తో నవీ ముంబయిలో తలపడుతోంది. టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్లో ఓటమిపాలైన దిల్లీ ఈ మ్యాచ్లో గెలుపుపై దృష్టి సారించింది. గుజరాత్ జట్టులో బెత్ మూనీ, సోఫీ డివైన్, ఆష్లే గార్డెనర్ వంటివారు ఉండగా, దిల్లీ జట్టులో షపాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె కాప్ వంటివారు కీలక పాత్ర పోషించనున్నారు.