యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా మహా గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమ ద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.