యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరప్రాంతమంత సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.