చిన్న సన్న కారు రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటపూర్ పీఏసీఎస్ లో ధాన్యం విక్రయిస్తున్న ముగ్గురు దళారులపై క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఏఈఓ సస్పెండ్, మరియు పీఏసీఎస్ సెంటర్ ఇంచార్జ్ ను విధుల నుండి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తొలగించారు.