చౌటుప్పల్ ప్రాంతంలోని పరిశ్రమలు పర్యావరణానికి హానికరమైన కాలుష్యాన్ని నియంత్రించకపోతే, పరిశ్రమలను ముట్టడిస్తామని సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన సీపీఐ మండల 7వ మహాసభలో పలువురు నేతలు పాల్గొన్నారు.