యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి నుంచి రేవనపల్లి, పెద్ద రావులపల్లి వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా తయారైందని సీపీఎం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్ ఆరోపించారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గుంతలమయమైన రోడ్లను పరిశీలించిన ఆయన, గతంలో పాదయాత్ర చేస్తామని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేసినప్పుడు, పాదయాత్రకు రెండు రోజుల ముందు గుంతల రోడ్డుకు శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు.