TG: నల్గొండలో జరిగిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పేరు మార్పుపై ఆయన ఎద్దేవా చేస్తూ, త్వరలో 'హెచ్ఆర్ఎస్' (హరీశ్రావు రాష్ట్ర సమితి) వస్తుందని అన్నారు. కేసీఆర్ పదేళ్లుగా నల్గొండ జిల్లాను మోసం చేశారని, ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. హరీశ్రావు టెండర్లు పిలవకముందే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, పూటకో పేరు మార్చుకునే కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.